జనసేన పార్టీ అధ్యక్షులు వన్ కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు గత నెల రోజులుగా పిఠాపురంలోనే ఉంటూ ఎన్నికల ప్రచార ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం పుర వీధుల్లో ఏ మూలన చూసినా జై జనసేన.. గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు.. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి.. అనే నినాదాలు మారు మ్రోగుతున్నాయి. ముఖ్యంగా మెగా కుటుంబం పిఠాపురం ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఆయన చేపడుతున్న రోడ్ షోలకు అధిక స్పందన లభిస్తోంది. శ్రీ నాగబాబు గారు నియోజకవర్గం అంతా పర్యటిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ ఓటు అభ్యర్తిస్తున్నారు.
పిఠాపురం పుర వీధుల్లో మారు మ్రోగుతున్న జనసేన నినాదాలు…
![WhatsApp Image 2024-05-04 at 8.58.11 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-04-at-8.58.11-PM.jpeg?resize=696%2C468&ssl=1)