Political

పిఠాపురం ప్రజలను కుటుంబ సభ్యులుగా వ్యక్తి పవన్ కళ్యాన్…

WhatsApp Image 2024-05-06 at 8.58.33 AM

రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి ఆ సమస్య పరిష్కారం చేసి, ఎవరు ఇబ్బంది పడుతుంటే వారిని ఆదుకునే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున భరోసాగా అందజేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. యూ. కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్టి వర్మ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ… వై.సీ.పీ. నాయకులు పవన్ కళ్యాణ్ గారిని నాన్ లోకల్ అని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతీ ప్రాంతం నాది అని భావించి సేవ చేసే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంను నా కుటుంబం అని భావించి సేవ చేస్తారని వెల్లడించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.