కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రోగులకు భోజనం తయారుచేసి వడ్డించే మెస్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం వై. శంకర్ అధ్యక్షతన జి.జి.హెచ్. లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జి.జి.హెచ్. లో మెస్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులకు కాంట్రాక్టర్ 12 నెలల నుంచి కట్టవలసిన పి.ఎఫ్. సొమ్మును కట్టకుండా ఎగ్గొట్టాలని చూస్తున్నారని అన్నారు. దీనిపై వెంటనే అధికారులు కలగ చేసుకోవాలని కోరారు.
12 నెలల నుంచి చెల్లించవలసిన పి.ఎఫ్. బకాయి దాదాపు పది లక్షల వరకు ఉంటుందని అన్నారు. ఈ నెల 31 వ తేదీ నుంచి జి.జి.హెచ్. మెస్ వర్కర్స్ కాంట్రాక్టర్ గడువు పూర్తవుతుందని ఏప్రియల్ 1వ తేదీ నుంచి కొత్త కాంట్రాక్టర్ బాధ్యతలు తీసుకుంటారని అన్నారు. ప్రస్తుతం ఇప్పుడున్న కాంట్రాక్టర్ తమ కాంట్రాక్టు ముగియక ముందే కార్మికులకు చెల్లించవలసిన పి.ఎఫ్. బకాయిని చెల్లించాలని అన్నారు.