Trending News

పీ.ఆర్‌. డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం…

IMG-20231109-WA0034

పిఠాపురం మహారాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. క్షతగాత్రులకు, అత్యవసర శస్త్రచికిత్సలకు అవసరమైన రక్తం అందుబాటులో ఉంచేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి.వి. తీరుపాణ్యం కూడా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని డి.ఎం.హెచ్‌.ఓ. డాక్టర్‌ నరసింహ నాయక్‌, జిల్లా టీబీ కంట్రోల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఆర్‌. రమేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా డి.ఎం.హెచ్‌.ఓ. మాట్లాడుతూ… డిగ్రీ విద్యార్థులు రక్తదానానికి ముందుకు రావటం అభినందనీయమన్నారు.

అత్యవసర సమయాల్లో క్షతగాత్రులకు రక్తం ఎక్కించాల్సి ఉంటుందని, అదే విధంగా కొన్ని రకాలైన శస్త్రచికిత్సల సమయంలో కూడా రక్తం అవసరం అవుతుందన్నారు. ఇప్పటికీ అనేక మంది రక్తం కోసం బ్లడ్‌ బ్యాంకులను ఆశ్రయిస్తున్నారని, వారు రక్తదానం చేసేందుకు వెనుకాడుతున్న పరిస్తితుల ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చన్న అవగాహన మరింత పెంపొందించాలన్నారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రి బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్‌ డాక్టర్‌ శారదా సిబ్బంది రక్తదాన శిభిరాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ జిల్లా ప్రోగ్రామ్‌ మేనేజర్‌ జి ఆదిలింగం, ప్రదీప్‌ శర్మ, కె ఆంజనేయులు, కృష్ణారావు, జయదేవ్‌ తరుతరులు పాల్లొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్