Exclusive

పీ.ఎఫ్. బకాయిలు వెంటనే చెల్లించాలి…!!!

WhatsApp Image 2024-02-01 at 9.06.31 AM

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ.టీ.ఎఫ్.) రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్ధిక బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ కాకినాడ జిల్లా కేంద్రం ధర్నా చౌక్ రోడ్ లో జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రిలే నిరాహారదీక్ష లు ప్రారంభించారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వి.వి. రమణ అధ్యక్షతన ప్రారంభించడం జరిగింది. కరప, పెదపూడి , జగ్గంపేట , ప్రత్తిపాడు , పిఠాపురం , పిఠాపురం టౌన్ మండలాల .యూ.టీ.ఎఫ్. కార్యకర్తలకు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి టి. రవి చక్రవర్తి నూలు దండలు వేసి రిలే నిరాహారదీక్షను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు తమ కుటుంబ అవసరాల కోసం, వైద్య ఖర్చులకు, ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న పి.ఎఫ్‌. 18000 కోట్ల రూపాయలు ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సి.పి.ఎస్. ను రద్దు చేసి, ఓ.పి.ఎస్. ను పునఃరుద్ధరించాలన్నారు. ఓ.పి.ఎస్ ను పునఃరుద్ధరించే పార్టీలకే తాము ఓటు వేస్తామని, vote for ops అనే నినాదంతో మేము ముందుకు వెళ్తామని తెలియజేసారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.