సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో పురాతన పద్ధతులతో దుర్గాప్రసాద్ స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్లొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. తిరుమల వెంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, హరిదాసు, గ్రామీణ, పల్లె పడుచుల వేషదారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనేక మంది విద్యార్థలు లుంగీ, షర్టు, భుజాన టవల్ దరించి ఉత్సాహంగా పాల్లొన్నారు. పాడిపంటలతో దాన్యపు రాసులతో సిరులొలికే గ్రామీణ ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయో అట్టిరీతిగా స్కూలు ఆవరణను తీర్చిదిద్దారు.
రోకళ్లలో పిండి దంచటం, తిరగలి విసుర్లు, కట్టెల పొయ్యపై పిండివంటలు, జానపద కథా వేదికలు, సాంస్కృతిక ప్రదర్శనలు, జమ్మిచెట్టు రచ్చబండ, గొబ్బమ్మలు, రంగవళ్లులతో పాఠశాల ప్రాంగణాన్ని పండుగ వాతావరణంగా రూపుదిద్దారు. స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం సంతోష్, భాను ప్రియాంక మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు సెల్ ఫోన్ కు అలవాటు పడి సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారన్నారు.