పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. పెద్దాపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కలిసి సామర్లకోట పట్టణంలోని మటన్ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన అభిమానులు రక్త దానం చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్ అన్నారు. సంక్షేమ రాజ్యాన్ని తీసుకువచ్చి, వినూత్న సేవా సంస్కృతిని రాజకీయాల్లోకి ఆయన తెచ్చారన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తనయులు నిమ్మకాయల రంగనాగ్, తెదేపా రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, తెలుగు రైతు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.