కాకినాడ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధిచేసి ఆ ప్రాంతంలో పేదరికాన్ని నిర్మూలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తుందని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి కాకినాడలో ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (MSE-CDP) కింద 14.76 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వర్చువల్ ద్వారా ముఖ్యమంత్రి కార్యక్రమం ముగిసిన అనంతరం వివేకనంద సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నూతన శ్రీ సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్ కు సంబందించిన శిలాఫలకాన్ని డా. కృత్తికా శుక్ల అతిధులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… మైక్రో & స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (MSE-CDP) కింద జిల్లాలోని కాకినాడలో 14.76 కోట్ల రూపాయల తో నూతన ప్రింటింగ్ క్లస్టర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ లోని వివేకానంద సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ , రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు , పరిశ్రమల శాఖ జి ఎం టి. మురళి , ఏపీఐఐసి జెడ్ ఎం మురళీమోహన్ తదిరులు హాజరయ్యారు.
పేదరికాన్ని నిర్మూలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం బాటలు… -కృతికా శుక్లా-
![WhatsApp Image 2023-11-29 at 5.35.17 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-29-at-5.35.17-PM.jpeg?resize=1280%2C700&ssl=1)