జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన సదస్సులో ప్రజల సమగ్ర అభివృద్ధే అసలైన అభివృద్ధి అని తెలిపారు. ఇందుకు అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించాలని అధికారులకు సూచించారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రతీ పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అప్పటి వరకు దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు కాదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తంచేసారు.
పెద్ద పెద్ద భవనాలను చూపి వాటిని అభివృద్ధిగా చూపిస్తే దాని వల్ల పేదలకు ప్రయోజనం ఉండదన్నారు. పేదల సంక్షేమంలో భాగంగా అభయ హస్తం కార్యక్రమం కింద ఆరు హామీల అమలుకు పేదల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.