ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం APJAC రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు AP JAC, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ తాలూక ఆధ్వర్యంలో చేస్తున్న మధ్యాహ్న భోజన విరామ ఉద్యమ కార్యాచరణ లో భాగం గా శుక్రవారం రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రాంగణంలో భారీ ఎత్తున అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పెంజనర్లు పాల్గోని నిరసన ప్రదర్శన మరియు ర్యాలి జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా APJAC ఛైర్మన్ జి రామ్ మోహన్ రావు మాట్లాడుతూ… ఉద్యోగులకు రావలసిన SL, GPF లోన్స్, APGLI, DA బకాయిలు, అన్నీ వెంటనే విడుదల చేయాలని, 12 PRC 30% IR వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పోరాడితీరుతామంటున్న ఉద్యోగులు…
![WhatsApp Image 2024-02-17 at 1.12.47 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-17-at-1.12.47-PM.jpeg?resize=1080%2C582&ssl=1)