ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా మరోసారి ప్రభుత్వ ఉద్యోగులు దశలవారీ పోరాటానికి సిద్ధమవుతున్నారు ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా, జిల్లా ఎస్పీ సతీష్ బాబుకు, కాకినాడ ఆర్డిఓ కిషోర్ కు బుధవారం సాయంత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు రామ్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి తమకు రావలసిన రాయితీలు తాము దాచుకున్న సొమ్ములను తిరిగి చెల్లించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఫన్షనర్స్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 నుండి దశల వారి పోరాటాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.