ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎలెక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాలో పోలింగ్ కేంద్రలను అధికారులు సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నంపచోడవర్ం మండలంలో సీ.ఐ. వాసా వెంకటేశ్వర రావు, ఎస్.ఐ. ఎం. మోహన్ కుమార్ రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ లను పరీశిలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… 18 సంవత్సరాలు నిండిన ప్రతీ యువతీ, యువకులు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.