నూతన ప్రభుత్వంలో ఎన్నికయ్యే 2024-29 చట్టసభల ప్రతినిధులు కాకినాడ నగర అభివృద్ధికి చేపట్టాల్సిన పబ్లిక్ మ్యానిఫెస్టో బుక్ లెట్ ప్రతులను వై.ఎస్.ఆర్.సీ.పీ. అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి సతీమణి మహాలక్ష్మీకి, తెదేపా అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వనమాడి వేంకటేశ్వ రరావు రూరల్ వై.ఎస్.ఆర్.సీ.పీ. అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణకు, జనసేన అభ్యర్థి పంతం నానాజీ కుమారుడు సందీప్లకు అందజేశారు. ఈ సందర్బంగా పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… అభ్యర్థులు అందరికీ పోస్ట్ ద్వారా స్వయంగా అందిస్తున్నామని తెలిపారు. నగర అభివృద్ధిపై ప్రతి నెల 13న సమావేశం జరుగుతుందని, ప్రతి ఏటా మే13న పౌర అజెండా ముద్రణ జరుగుతుందని తెలిపారు. 10వేల కాపీల ప్రతులను గత మూడురోజులుగా ప్రజలకు అందిస్తున్నామన్నారు.
పౌర అజెండా అందుకున్న కాకినాడ అసెంబ్లీ అభ్యర్థులు…
![557fffc2-6526-4d27-a583-ee650cd8edaf](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/05/557fffc2-6526-4d27-a583-ee650cd8edaf.jpg?resize=1280%2C700&ssl=1)