News Trending News

ప్రకృతి పడగొట్టేస్తుంది..!

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం జి. రాగంపేట రోడ్డులో కట్టిన జగనన్న కాలనీ ముందు నిర్మించిన భారీ హోర్డింగ్ నెలకొరిగి తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పాడి ప్రజలకు ఇబ్బందులు పడ్డారు. జగనన్న కాలనీకి కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. కనీసం మున్సిపల్ త్రాగునీరు గాని పారిశుధ్య పనులు గాను చేపట్టడం లేదని, వైసిపీ ఇంఛార్జు సూపర్ ఎమ్మెల్యే గా వ్యవహరిస్తున్నారు తప్ప కనీసం పార్కులు మెయింటైన్ చేయడం లేదన్నారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ మెయింటైన్ చేయడం లేదని, కనీసం మొక్కులకు కూడా నీళ్లు వేయడం లేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి మున్సిపల్ నిధులు విడుదల చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. 2021లో 55 ఎకరాల్లో 2,440 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత మడమ తిప్పేశారు. ప్రస్తుతానికి ఇక్కడ పూర్తయిన 1,019 ఇళ్లను మాత్రమే జగన్ పంపిణీ చేశారు. జగన్ వస్తున్నారని అధికారులు హడావుడిగా షీర్ వాల్ టెక్నాలజీ ఉపయోగించి అప్పటికప్పుడు 159 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించారన్నారు.

Avatar

Spy News

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం