అమర గాయకుడు ఘంటసాల 101వ జయంతి సందర్భంగా కాకినాడ సూర్య కళామందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 101వ జయంతి ఆది లీల ఫౌండేషన్, సరస్వతి గానసభల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ విభావరిలో నిర్వహించిన ఘంటసాల గాన అవధానం పలువురు శ్రోత్తలను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు డాక్టర్ జిత్ మోహన్ మిత్ర హాజరైయ్యారు. సంగీత విభావరి నిర్వహించి ఘంటసాల గానం చేసిన పాటలను వినిపించారు. అలాగే ఘంటసాల అవగాహన సామ్రాట్ డాక్టర్ ఎస్. రహమతుల్లా ఘంటసాల విభావరి నిర్వహించి ప్రేక్షకులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఘంటసాల జీవితం గురించి వివరించారు. ఘంటసాల పాటలతో పాటు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావులకు చెందిన పాటలను పాడి వినిపించారు.
ప్రజలను ఆకట్టుకున్న ఘంటసాల సంగీత…
![WhatsApp Image 2023-12-04 at 5.45.30 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-5.45.30-PM.jpeg?resize=1280%2C700&ssl=1)