కాకినాడ సీటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపణలను ఖండించారు. కాకినాడలో అన్నీ డెవలప్ చేయగలిగామని, నీతో చర్చకువచ్చి నీ మైలేజ్ పెంచడం ఇష్టంలేదని అపహాస్యం చేశారు. అందుకే చర్చకు రాదలచుకోలేదని వెల్లడించారు. నీలాంటి అజ్ఞానులతో మాట్లాడనని ఎమ్మెల్యే ద్వారంపూడి పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాకినాడలోని 43 డివిజన్ ప్రజలు అభివృద్దికోసం వివరిస్తారని వెల్లడించారు.