నేడు 8 రాష్ట్రాలు, యుటిలలోని 57 స్థానాల్లో లోక్సభ ఎన్నికలకు ఏడవ, చివరి దశ పోలింగ్ ప్రారంభం కాగా.. ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఓటర్లను కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… లోక్సభ ఎన్నికల చివరి దశలో ఈరోజు ఓటింగ్ జరగనుందని, ఈ గొప్ప ప్రజాస్వామ్య పండుగలో ఈ దశకు ఓటర్లందరూ ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా కోరుతున్నానన్నారు. మా యువత, మహిళా ఓటర్లు తమ ఓటు వేయడానికి రికార్డు సంఖ్యలో ముందుకు వస్తారని నేను విశ్వసిస్తున్నానని ఆయన అన్నారు. మనం కలిసి మన ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతం చేద్దామని వారణాసి నుండి పోటీ చేసిన ప్రధాన మంత్రి సామాజిక వేదిక X లో పోస్ట్ చేసారు.