- కమిషనర్ నాగనరసింహారావు
![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/Commissioner-Naga-Narasimha-Rao-scaled.jpg?fit=640%2C339&ssl=1)
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తోన్న సేవలు ప్రజలందరికీ చేరువయ్యేలా ప్రజారోగ్య సిబ్బంది దృష్టిపెట్టాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు కోరారు. స్థానిక స్మార్ట్సిటీలో ఈ అంశంపై ఎంహెచ్వో డాక్టర్ ఫృద్వీచరణ్, మెడికల్ ఆఫీసర్లు, ఎఎన్ఎంలతో శనివారం సాయంత్రం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఒక్క గృహయజమాని ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా కృషి చేయాలన్నారు. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యశ్రీ సేవలు అందించే సమీపంలో ఉన్న ఆస్పత్రుల వివరాలు, అక్కడ అందించే వైద్యసేవలకు సంబంధించిన సమాచారం తెలుస్తోందన్నారు. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడంతోపాటు వినియోగించుకునే విధానంపై వలంటీర్లు ప్రతీ ఇంటికి వెళ్ళి అవగాహన కల్పించాలన్నారు. కార్పొరేషన్ పరిధిలో సుమారు 75వేల కుటుంబాలు డౌన్లోడ్ చేసుకోవలసి ఉందని, ఇప్పటి వరకు సుమారు 14వేల మంది మాత్రమే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. ప్రతీ నివాసాన్ని ఆరోగ్యశ్రీ యాప్ పరిధిలోకి తీసుకొచ్చేలా వైద్య సిబ్బంది చొరవ తీసుకోవాలన్నారు.