తుఫాన్ సందర్బంగా సామర్లకోట మండలం పి.బి.దేవం అన్నపూర్ణ లిఫ్ట్ ఇరిగేషన్ సోసైటి వద్ద ఎం.పి.టి.సి. సభ్యులు మలకల సూరిబాబు రైతులతో భేటీ ఆయ్యారు. మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో పంట నష్టం కలిగానవారికి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు అధికారులు ఎక్కడికక్కడ పరిశీలన చేస్తున్నారన్నారు. 211 సహాయ శిబిరాలకు సుమారు 10 వేల మందిని తరలించారని చెప్పారు.
క్యాంప్ కార్యాలయం నుంచి సీ.ఎం. జగన్ ఎప్పటికప్పుడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా జిల్లా కలెక్టర్లకు,అధికార్లకు సూచించారని, ఏటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు తగు సూచనలు ఇచ్చారని చెప్పారు. ఈ ప్రభుత్వం రైతు పక్ష పాత ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అన్నీ చర్యలు చేపడుతుందని సూరిబాబు చెప్పారు.