ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లాండ్ టైటిలింగ్ ఆక్ట్ 17/2023 వలన ప్రజలకు న్యాయవాదులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని ప్రత్తిపాడు న్యాయవాదులు అన్నవరం గ్రామంలో నిరసన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు తొలత పావాంచ నుంచి బయలు దేరి చిన రావి చెట్టు సెంటర్ వరకు నడుస్తూ నినాదాలు చేసారు. ఈ యాక్ట్ ను వెంటనే రద్దు చేయాలంటూ వారి యొక్క భావాలను వ్యక్త పరిచారు.
ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు బార అసోసియేషన్ అధ్యక్షులు సీ.హెచ్. పుల్లయ్య మాట్లాడుతూ… ఈ చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. వెంటనే ఈ యాక్ట్ ను రద్దు చేయాలని లేకపోతే ఈ ఉద్యమం తీవ్ర తరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు బార్ అధ్యక్షులు సీ.హెచ్. పుల్లయ్య, సెక్రెటరీ బీ. మధుబాబు, ట్రెజరర్ జొన్నాడ రాజేష్, జాయింట్ సెక్రటరీ రాయి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.