దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన 14, 15 సర్కిల్స్ పరిధిలోని శాంతినగర్, కొత్త కాకినాడ ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం, పండుగ సెలవుల నేపథ్యంలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆయన కోరారు. కొన్నిచోట్ల బాణాసంచా వ్యర్ధాలు, చెత్త పేరుకు పోవడానికి గుర్తించారు. వెంటనే వీటిని తొలగించాల్సిందిగా ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని సూచించారు. ప్రజలు కూడా చెత్తను రోడ్లపై వేయకుండా పారిశుద్ధ్య విభాగానికి సహకరించాలని కోరారు.
ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-
![IMG-20231114-WA0006](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/IMG-20231114-WA0006.jpg?resize=1280%2C700&ssl=1)