నీట్-యూజీ 2024 పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ ఎం.పీ. రాహుల్ గాంధీ మంగళవారం విమర్శించారు. కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్.టీ.ఏ. పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్దిసేపటికే ప్రధానిపై రాహుల్ గాంధీ తాజా దాడి జరిగింది. నీట్-యూజీ 2024 పరీక్ష నిర్వహణలో ఎవరైనా 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నప్పటికీ దానిని పూర్తిగా పరిష్కరించాలని పేర్కొంది.
నీట్ పరీక్షల కుంభకోణంతో 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్న అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. బీహార్, గుజరాత్, హర్యానాలలోని అరెస్టులు పరీక్షా ప్రక్రియలో ప్రణాళికాబద్ధమైన మరియు వ్యవస్థీకృత అవినీతి జరిగిందని స్పష్టంగా సూచిస్తున్నాయన్నారు. ఈ బీ.జే.పీ. పాలిత రాష్ట్రాలు పేపర్ లీక్కు కేంద్రంగా మారాయని రాహుల్ గాంధీ X లో పోస్ట్ చేశారు.