వినియోగదారులకు రూఫ్టాప్ సోలార్ ప్యానెళ్లను అందించడంపై దృష్టి సారించిన ‘ప్రధాని మంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సౌర విద్యుత్తును నేరుగా ఇళ్లకు చేరవేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని ప్రధాని తెలిపారు. ముఖ్యంగా పేద మరియు మధ్య-ఆదాయ వర్గాలకు వారి విద్యుత్ బిల్లులను తగ్గించడం ద్వారా సహాయం చేయడం లక్ష్యంగా కేంద్రం పెట్టుకుందని చెప్పవచ్చు.
లబ్ధిదారుల కోసం రూఫ్టాప్ సోలార్ సిస్టమ్ల ఏర్పాటుకు సాధారణ విధానం కోసం వివరించింది. ఆసక్తి ఉన్న లబ్ధిదారులు ఆమోదించబడిన ప్రాజెక్ట్ డెవలపర్లు, సిస్టమ్ ఇంటిగ్రేటర్లు, తయారీదారులు మొదలైన వారి ద్వారా సోలార్ రూఫ్టాప్ సిస్టమ్లను ఇన్స్టాల్ చేసుకోవలని తెలిపింది. డిస్కామ్ల నుండి అవసరమైన ఆమోదం పొందిన తర్వాత, ఇన్స్టాలేషన్ పేర్కొన్న సామర్థ్య పరిమితులకు కట్టుబడి ఉండాలని సూచించింది.
ప్రధాని సూర్యోదయ యోజనకు వీరే అర్హులు…???
![pm-modi-PTI-1](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/pm-modi-PTI-1.jpg?resize=750%2C500&ssl=1)