Knowledge

ప్రపంచ అనస్థీషియా దినోత్సవం… — ర్యాలీ నిర్వహించిన అనస్థీషియా వైద్యులు —

WhatsApp Image 2023-10-16 at 2.42.03 PM

1846, అక్టోబరు 16న, మొదటిసారిగా డబ్ల్యూటీజి మోర్టన్ మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో దంతాల వెలికితీతలో ఈథర్ అనస్థీషియాను ఉపయోగించడాన్ని విజయవంతంగా ప్రదర్శించారు. అప్పటి నుండి, రోగులలో మెరుగైన నొప్పి నియంత్రణతో శస్త్రచికిత్స యొక్క అభ్యాసం పూర్తిగా మారిపోయింది. అందుకే, అప్పటి నుంచి అక్టోబర్ 16వ తేదీని ప్రపంచ అనస్థీషియా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 2023 యొక్క థీమ్ అనస్థీషియా, క్యాన్సర్ కేర్, క్యాన్సర్ రోగులలో పాలియేటివ్ కేర్‌లో అనస్థీషియాలజిస్టుల పాత్రను హైలైట్ చేస్తుంది. ఈ మేరకు అనస్థీషియా విభాగం, ప్రభుత్వ వైద్య కళాశాల, కాకినాడ లోని ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియాలజిస్ట్స్, కాకినాడ నగర శాఖ ఆధ్వర్యంలో అనస్థీషియా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా రామ్కోస లో సీపీఆర్ అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు. రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ నుండి రాంకోస వరకు అవగాహన ర్యాలీని వైద్యులు, మెడికో విద్యార్థులు నిర్వహించారు.
ఈ సంధర్భంగా ప్రముఖ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ అనిల్ పొడూరి తోపాటు మరికొందరు వైద్యులు మాట్లాడుతూ ఆపరేషన్ సమయంలో అనేక మందికి అనేక అనుమానాలు కలుగుతాయని మత్తూ వైద్యులతో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని వైద్యులు ను కోరారు. నగరంలోని వైద్య విద్యార్థులు, అనస్థీషియా టెక్నీషియన్లు, విద్యార్థులు, అనస్థీషియాలజిస్టులు అందరూ చురుకుగా ఈ ర్యాలీ లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్. విష్ణువర్ధన్,, డా. భానుమతి, డా. అచ్యుత్, డా. అనిల్ పొడూరి,డా. తేజేష్, డా. లక్ష్మీనారాయణ, మరియు డాక్టర్లు మెడికల్ స్టూడెంట్స్ టెక్నీషియన్స్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-15 at 5.21.24 PM
Knowledge

డిగ్రీ కోసం కాక విజ్ఞానం కోసం తపించేవారే నిజమైన విద్యార్ధులు. – డాక్టర్ కాదా వెంకటరమణ-

  డిగ్రీ కోసం కాక విజ్ఞానం కోసం ప‌రితపించేవారే నిజమైన విద్యార్ధుల‌ని స‌త్య స్కాన్ అండ్ డ‌యాగ్నోస్టిక్స్ ఛీఫ్ రేడియాల‌జిస్ట్ డాక్ట‌ర్ కాదా వెంక‌ట‌ర‌మ‌ణ‌ అన్నారు. ఆయన
WhatsApp Image 2023-12-01 at 1.06.35 PM
Knowledge

ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం… -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా-

హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి బాధితులు ధైర్యంగా జీవించాలని, ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించేందుకు త్వరలో మందులు వచ్చేందుకు వీలుగా పరిశోధనలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు.