అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మడుపల్లి గ్రామానికి చెందిన 15 మంది కుటుంబాలకు చెందినవారు డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు సెంట్లు భూమి చొప్పున ప్రభుత్వం మంజూరు చేసారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన భూములకు అధికారులు పట్టాలు ఇవ్వలేదని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లోనే గృహాలను నిర్మించుకుని జీవిస్తున్నామని ఆ భూములకు పట్టాలు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కు స్పందనలో ఫిర్యాదు చేశామని అన్నారు.
జగనన్న కాలనీలో పేరుతో సెంట్న్నర భూమి మంజూరు చేసి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ చేస్తుందని అలాగే మా 15 మంది కుటుంబాలకు రెండు సెంట్లు చొప్పున ఇచ్చిన దానికి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కే. రామస్వామి, కే. వినాయక రావు, బి. ప్రసాద్ రావు, వాసంశెట్టి నాగేశ్వరరావు, కముజు సత్యవతి, రాయుడు వెంకటేశ్వరరావు, మద్దాల సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.