మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో చలనం లేదని ముఖ్యమంత్రి పంతం విడనాడీ సమ్మెను పరిష్కరించాలని AITUC రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్టీసీ కార్యాలయం సమీపంలో మునిసిపల్ ఆర్జేడి కార్యాలయాన్ని వందలాదిమంది కార్మికులు ముట్టడించారు. అంతకుముందు స్థానిక రెల్లిపేట నుండి ప్రారంభమైన ప్రదర్శన సెల్టన్ సెంటర్ ఆర్టిసి బస్టాండ్ మీదుగా ఆర్జేడి కార్యాలయంకు చేరుకొoది.
ఈ సందర్బంగా రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ… సమ్మెను వెంటనే పరిష్కారం చేయకపోతే మున్సిపల్ కార్మికుల సత్తా చూపిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి పారిశుధ్య కార్మికుల పట్ల నిర్లక్ష్యం మొండి వైఖరి మానుకోవాలన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై స్పందించని ప్రజా ప్రతినిధులకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతాం అన్నారు.
ప్రభుత్వం పంతాలు మాని సమ్మె విరామించాలి…
![WhatsApp Image 2024-01-10 at 2.08.53 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-10-at-2.08.53-PM.jpeg?resize=1280%2C700&ssl=1)