సామర్లకోట పట్టణంలోని రైల్వే స్టేషన్ సెంటర్ సమీపంలో రథం షెడ్డు వద్దగల మేజర్ డ్రైన్ కల్వర్టు ప్రమాధ భరితంగా మారింది. కల్వర్ట్ కు రెండు వైపులా ఉన్న స్లాబ్ ను మున్సిపల్ అధికారులు ముక్కలుగా పగులగొట్టి వదిలేశారు. ఇది జరిగి మూడు రోజులు గడిచినా… అలాగే వదిలిపెట్టడంతో ఆ ప్రాంతంలో భారిగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ద్విచక్ర వాహన దారులు ఆ మార్గంగుండా వెళుతూ శిధిల కల్వర్టు వద్ద అదుపు తప్పి పడిపోతున్నారు. దాని చుట్టుపక్కల ఎటువంటి బ్యారికేడ్స్ ఏర్పాటు చెయ్యక పోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కల్వర్టు నిర్మాణ పనులు పూర్తి చెయ్యాలని అప్పటి వరకు భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.