విశాఖపట్నంలో విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనానికి జరిగిన ప్రమాద నేపద్యంలో సామర్లకోట పట్టణంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. సామర్లకోట పట్టణ పరిధిలోని స్టేషన్ సెంటర్లో ఉన్న మూడు ఆటో స్టాండుల వద్ద, మెహర్ కాంప్లెక్స్ సెంటర్ వద్ద పాఠశాల విద్యార్థుల కోసం నడుపుతున్న ఆటో డ్రైవర్లతో మాట్లాడి అవగాహన కల్పించారు. విశాఖపట్నంలో కేవలం ఒక ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అనేకమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం వచ్చిందన్నారు. అలాంటి ప్రమాదాలు స్థానికంగా జరగకుండా ప్రధానంగా ఆటో డ్రైవర్లు చిన్నపిల్లల విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ వేగాన్ని నిరోధిస్తూ క్షేమంగా విద్యార్థులను పాఠశాలకు, తిరిగి వారి గృహాలకు చేర్చాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్న ఎవరిని ఉపేక్షించేది లేదని ట్రాఫిక్ ఎస్ఐ. .అడపా గారగా రావు, లా అండ్ ఆర్డర్ ఏ.ఎస్.ఐ. మూర్తి లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రాజు, కానిస్టేబుల్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదాలపై ఆటో డ్రైవర్ లకు అవగాహన…
![WhatsApp Image 2023-11-22 at 8.18.37 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-22-at-8.18.37-PM.jpeg?resize=1280%2C576&ssl=1)