నవోదయ విద్యాలయంలో 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు గానూ ప్రస్తుతం 8వ తరగతి, పడవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. మండల విద్యా శాఖధికారి వై. శివ రామ కృష్ణయ్య పర్యవేక్షణలో గవర్నమెంట్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలల్లో జరిగాయి. ఈ పరీక్షలకు సెంటర్ లెవెల్ పరిశీలకులుగా వి. జగన్ మోహన్ రావు వ్యవహరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే విద్యా సంవత్సరానికి సంభందించి 9వ తరగతిలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న నేపధ్యంలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్డులకు నాలుగు సెంటర్ల లోనూ, ఇంటర్ మొదటి సంవత్సరం లో చేరేందుకు ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం పెద్దాపురంలో రెండు కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. ఎం.ఈ.ఓ. శివ రామ కృష్ణయ్య మాట్లాడుతూ… అన్ని కేంద్రాల్లో నవోదయ ప్రవేశ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులంతా పరీక్షలు పూర్తిచేసారన్నారు.