మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇండోర్లో 11వ తరగతి చదువుతున్న అభిషేక్ అనే విద్యార్థి ఏప్రిల్స్ ఫూల్స్ డే రోజు తన స్నేహితుడిని ప్రాంక్ చేయాలని ప్రయత్నించాడు. ఫ్రెండ్కు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నటించాడు. స్టూల్ పై నిల్చొని మెడకు తాడు బిగించి తాను చనిపోతున్నట్లు స్నేహితుడిని నమ్మించాడు. అయితే ఈ క్రమంలో అనుకోకుండా స్టూల్ జారిపోవడంతో మెడకు తాడు గట్టిగా బిగుసుకుపోయి విద్యార్ధి మృతి చెందాడు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే అతడు మరణించినట్లు పేర్కొన్నారు.