ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్యలో రామ మందర్ బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని మహద్బుతంగా నిర్వహించారు. ఈ కార్య్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాణప్రతిష్ట ముగిసిన తదనంతరం మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పేద, మధ్య తరగతి ప్రజల దృష్య వారికి విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు, అంతేకాకుండా ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనంగా మార్చేందుకు మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం ద్వారా దేశంలో ఉన్న కోటి ఇండ్లకు సోలార్ రూఫ్ టాప్ లు అందించనున్నట్లు వెళ్లడించారు.