స్థానిక కబడ్డీ క్రీడాకారుడు, పిజికల్ డైరెక్టరు బోగిళ్ల మురళీ కుమార్ ప్రోకబడ్డీ 10వ సీజన్ కు రిఫరీగా ఎంపిక అయ్యారు. క్రికెట్ తరువాత కబడ్డీకి మంచి ఆదరణ పెరగడంతో ప్రో కబడ్డీని ఎక్కువ మంది తిలకిస్తున్నారు. బెంగుళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, కలకత్తా, డీల్లీ, పట్నా, పూణేలలో శనివారం నుంచి జరిగే ప్రోకబడ్డీ మ్యాచ్లకు మురళీకుమార్ రిఫరీగా వ్యవహరిస్తారు. రాష్ట్రం నుంఛి ఎంపిక అయిన ఏకైక రిఫరీ సామర్లకోటకు చెందిన పిజికల్ డైరెక్టరు కావడం విశేషం.
జోగిళ్ల మురళీ కుమార్ ఇప్పటి వరకు 8వ పర్యాయాలు ప్రోకబడ్డీ’ రిపరీగా వ్యవహరిస్తున్నారు. మురళీకుమార్ ప్రొకబడీ రిఫరీగా ఎంపిక కావడం పట్ల ఉమ్మడి జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసు, రాష్ట్ర కోచ్ పోతుల సాయిప్రసాద్, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు వుండవిల్లి ప్రసాద్, తదితరులు అభినందించారు.
ప్రో కబడ్డీ రిఫరీగా బోగిళ్ల మురళీకుమార్ ఎంపిక…
![WhatsApp Image 2023-12-01 at 11.10.47 AM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-01-at-11.10.47-AM.jpeg?resize=1024%2C632&ssl=1)