రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం ఆదివారపుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి 57 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అందుకు కారణం ఆ రోజు తిన్న చికెన్ బిర్యానియే కారణమని విద్యార్థులు చెబుతున్నారు. నాణ్యతలేని చికెన్, నాణ్యతలేని గుడ్డు వల్ల ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని దీనికి కారణమైన వారిని శిక్షించాలని రామచంద్రపురం బి.ఎస్.పి. ఎం.ఎల్.ఏ. అభ్యర్థి సుబ్బు భాయ్ డిమాండ్ చేశారు.
కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని, అతని కాంట్రాక్ట్ ను వెంటనే రద్దు చేయాలని, హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రామచంద్రపురం స్టూడెంట్ జే.సి. అధ్యక్షులు ప్రత్తిపాటి బుల్ రాజు, పీ.డీ.ఎస్.యు. జిల్లా అధ్యక్షులు సిద్దు, బి.ఎస్.పీ. రామచంద్రపురం సిటీ అధ్యక్షులు షేక్ అలీ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.