తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో కె. చంద్రశేఖర్ రావు బి.ఆర్.ఎస్. పార్టీ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి కొన్ని కంప్యూటర్ సిస్టమ్స్, అధికారిక డేటాను ధ్వంసం చేసిన కేసులో హైదరాబాద్ పోలీసులు ఆదివారం మరో ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులను పట్టుకున్నారు.
కే.సీ.ఆర్. హయాంలో సీ.ఎం. రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లు టేపింగులకు గురయ్యాయని ఆరోపించారు. బీ.ఆర్.ఎస్. పార్టీ ఫండ్కు భారీ మొత్తంలో జమ చేసేందుకు వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసేందుకు కూడా నిఘా పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలపై బీ.ఆర్.ఎస్. ఇంకా స్పందించలేదు.
ఈ కేసులో ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులను అరెస్టు చేశారని వెళ్లడించారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసినట్లు వార్తా సంస్థ పి.టి.ఐ. నివేదించింది. ఇద్దరు సీనియర్ అధికారులు అక్రమ నిఘా, సాక్ష్యాలను నాశనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.