Trending News

బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవు… -డా. యస్.జీ.టి. సత్య గోవింద్-

maxresdefault (4)

తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ అనవాళ్ళు లేవని కోళ్ళ రైతులు, కోడి మాంస వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా. ఎస్.టి.జి. సత్య గోవింద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. కోడిమాంసం, కోడిగ్రుడ్లు తినుట వలన బర్డ్ ఫ్లూ రాదని అలాంటి గాలి వార్తలు నమ్మవద్దని తూర్పు గోదావరి జిల్లాలోని యావన్మంది కోళ్ళ రైతులకు మరియు కోడి మాంస ప్రియులకు తెలిపారు.

పశు సంవర్ధక శాఖ పూర్తిగా సర్వే నిర్వహించి ఈ వ్యాధి ఆనవాళ్ళు ఎక్కడా లేవని ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో ఎక్కడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి వలన మనుష్యులకు వ్యాప్తి చెంది చనిపోయిన దాఖలాలు లేవన్నారు. కోడి గ్రుడ్లు మరియు కోడి మాంసము సంప్రదాయ బద్దంగా ఉడికించి తినుటవలన ఏ విధమైన ఇతర వ్యాధులు కూడా సంక్రమించే అవకాశం లేదన్నారు .

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్