తమిళ హీరో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ అభిమానులకు పండుగ సందర్బంగా జనవరి 12న థియేటర్లలో విడుదలచేసారు. సానుకూల సమీక్షలతో ప్రారంభమైన ఈ పీరియాడిక్ డ్రామా 1వ రోజు నుండి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ సినిమా బాక్సాఫిస్ దగ్గర 5వ రోజున దాదాపు 10 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిందని తెలిపారు.
ఈ సినిమా కలెక్షన్స్ మొత్తం 50 కోట్ల మార్కుకు పైగా తీసుకొచ్చిందని సమాచారం. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ‘కెప్టెన్ మిల్లర్’ బ్రిటీష్ ప్రభుత్వం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడం గురించి ఉంటుందని తెలస్తుంది. ఈ చిత్రం స్వాతంత్రానికి పూర్వం నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం సొంత రాష్ట్రంలో రూ. 35 కోట్లు రాబట్టినట్లు సమాచారం.