మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచార సంఘటన, గృహహింస తదితర విషయాల్లో బాధితులకు సకాలంలో వైద్య సేవలు, చట్టపరమైన సేవలతో బాటు న్యాయ సంబంధిత విషయాల్లో బాధితులకు అండగా ఉండేందుకుగాను సౌకర్యంతమైన భవనాన్ని కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ విట్టల్ పేర్కొన్నారు.
ఈ నూతన భవనాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ విటల్ మాట్లాడుతూ పలు రకాలైన వివాద కారణాలతోను, అత్యాచార ఘటనలోనూ, గ్రహింస పరంగా బాధితులైన వారికి ఈ దిశ వన్ స్టాప్ కేంద్రం పలు రకాల సేవలు అందిస్తుందని అన్నారు.