ఆంధ్ర ప్రదేశ్ లో మరో రెండు రోజులు గడిస్తే వై.సీ.పీ. ప్రస్తావన ఉండదని, అలాగే లాండ్ టైటిల్ ఆక్ట్ నిలబడదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. ప్రజల భూములు లాక్కోవాలనే కుట్రతో, ప్రజలను మోసం చేస్తూ వై.సీ.పీ. ప్రభుత్వం లాండ్ టైటిల్ ఆక్ట్ తీసుకొచ్చిందని అన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ కీర్తి రామ జోగేశ్వరరావ్ నేతృత్వంలో చేబ్రోలు పార్టీ కార్యాలయానికి విచ్చేసిన బార్ అసోసియేషన్ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు. జగన్ పైశాచికత్వం విధ్వంసంతో మొదలై ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం, అందినంతా దోచుకోవడం, అడొచ్చిన వారిని బెదిరించడం, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం పరిపాలన మొత్తం తన ఇష్టారాజ్యంగా మార్చేసుకున్నారని దుయ్యబడ్డారు. ఇప్పుడు తాజాగా ప్రజల ఆస్తులు కూడా దోచుకోవడానికి లాండ్ టైటిల్ ఆక్ట్ అనే పన్నాగం పన్నాడని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే “లాండ్ టైటిల్ ఆక్ట్” ప్రక్రియను రద్దు చేస్తామని చెప్పారు.