Cricket

బిగ్‌ స్క్రీన్‌ పై ‘భారత్‌– ఆస్ట్రేలియా’ ఫైనల్‌ మ్యాచ్‌

images (14)

ప్రపంచ కప్‌లో భాగంగా ఈనెల 19న భారత్‌– ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌ను అభిమానులు పెద్ద స్క్రీన్ల (ఫేన్‌ ఎరీనా) పై తిలకించేందుకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏ.సీ.ఏ) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఏ.సీ.ఏ కార్యదర్శి శ్రీ ఎస్‌.ఆర్‌. గోపినాథ్‌ రెడ్డి వెల్లడించారు. స్టేడియంలో ఉన్న వాతావరణాన్ని కల్పించి ఆనందంగా మ్యాచ్‌ను చూసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదట ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మ్యాచ్‌ను అభిమానులు ఉచితంగా వీక్షించవచ్చని తెలిపారు. అక్కడ ఫుడ్‌ కౌంటర్లు ఉంటాయన్నారు. పెద్ద స్క్రీన్లను అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.  

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-12-04 at 5.45.28 PM
Cricket

తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలి…. -ఎస్పీ కి ఫిర్యాదు-

కాకినాడ జిల్లాలో సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ స్పందన కార్యాక్రమం లో కాకినాడ రూరల్ సర్పవరం గ్రామానికి చెందిన రాజేశ్వరి నగర్
OIP (10)
Cricket

కోహ్లి ఆటపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాక్యలు…

అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో విరాట్ కోహ్లీ దూకుడుగా వ్యవహరించిన తీరుపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయితే నిలకడను కొనసాగించడం