ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ ముఖ్యమంత్రి ఇంట్లోనే తనను పలుమార్లు చెప్పుతో కొట్టారని స్వాతి మలివాల్ ఆరోపించారు. గురువారం రాజ్యసభ ఎం.పీ. వాంగ్మూలం ఆధారంగా బిభవ్ కుమార్పై నమోదైన ఎఫ్.ఐ.ఆర్. లో ఢిల్లీ పోలీసులు ఆమె కడుపుపై కొట్టారని, చెప్పుతో కొట్టారని, తన్నారని పేర్కొన్నారు.
స్వాతి మలివాల్ వాంగ్మూలాన్ని ఆమె నివాసంలో నమోదు చేసిన కొన్ని గంటల తర్వాత ఢిల్లీ పోలీసులు గురువారం తమ ఎఫ్.ఐ.ఆర్.లో బిభవ్ కుమార్ పేరును నమోదు చేసారు. IPCలోని 354, 506, 509, 323 సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. స్వాతి మలివాల్ మెడికల్ చెకప్ చేయించుకోవడానికి నిన్న రాత్రి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి వెళ్లారు.