గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో భారతదేశాన్ని డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దుతున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన బిల్ గేట్స్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య సధీర్ఘ చర్చ కొనసాగింది. విరిద్దది మధ్య జరిగిన సంభాషనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మాడియాలో విడుదలైంది. దీనికి గుర్తుగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలతో కూడిన ట్రైలర్ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ సమావేశంలో ఇద్దరు చాలా ముఖ్యమైన విషయాలను చర్చించినట్లు తెలిస్తోంది. వాటితో పాటు కృత్రిమ మేధస్సు, మహిళల నేతృత్వంలో అభివృద్ధి, వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు, ఆరోగ్యం మరియు వాతావరణంలో అనుకూలత తదితరల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ భారత ప్రభుత్వం టెక్నాలజీని ప్రజలకు చేరువ చేస్తున్న తీరుపై బిల్ గేట్స్ తో చర్చించారు.
బిల్ గేట్స్ తో ప్రధాని మోదీ భేటీ…
![OIF](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/OIF-8.jpg?resize=474%2C316&ssl=1)