ఈ నెల 10వ తేదీన (శనివారం) మ. 2.00 గంటలకు కాకినాడ జిల్లాలో గల సర్పవరం జంక్షన్ కూరగాయల మార్కెట్ సమీపంలో ఎస్.ఆర్.ఎం.టీ. గెస్ట్ హౌస్ ఎదుట ఉన్న వలసపాకలు రోడ్ లో శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు బి.సి. ల రాజకీయ ప్రాతినిథ్యం పై సమావేశం ఏర్పాటు చేసారని బీ.సీ. సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు చొల్లంగి వేణు గోపాల్ పిలుపుపిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బి.సి. లకు రాజకీయ ప్రాతినిధ్యం, రాజకీయ పార్టీలు హెచ్చు సీట్లు ఇవ్వాలని పార్టీలను డిమాండ్ చేయుట మున్నగు విషయాలపై చర్చ జరుగుతుందన్నారు. బి.సి. సోదరులు, సోదరీమణులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
బి.సి. లకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి…. -చొల్లంగి వేణు గోపాల్-
![R (7)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/R-7.jpg?resize=800%2C448&ssl=1)