బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్-యునైటెడ్ జే.డీ.యూ. ప్రతినిధి బృందం రానున్న కాలంలో ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తుందని, బీహార్కు ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీపై తమ డిమాండ్ను వెల్లడిస్తామని రాష్ట్ర మంత్రి డాక్టర్ అశోక్ చౌదరి శనివారం తెలిపారు.
జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం చౌదరి విలేకరులతో మాట్లాడుతూ.. బీహార్కు ప్రత్యేక హోదా డిమాండ్ కొత్తదేమీ కాదని కేంద్ర మంత్రి లల్లన్ సింగ్, జే.డీ.యూ. వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని పార్టీ ఎం.పీ. ల బృందం ప్రధాని మోదీని కలుస్తుందని చెప్పారు. అయితే ప్రధానిని ఎప్పుడు కలుస్తారో ఆయన వెల్లడించలేదు.