కాకినాడ జిల్లాలో పోషక ఆహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు మరింత పోషకాహారం అందించే విధంగా సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మిన్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తన దాత్రుత్వాన్ని చాటుకుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల నుండి 80 లక్షలు రూపాయలు కాకినాడ జిల్లా ఐ.సి.డి.ఎస్. డిపార్ట్మెంట్కు కేటాయించారు. ఇందుకు కృషిచేసిన బీ.జే.పీ కాకినాడ జిల్లా అధ్యక్షులు, మింటింగ్ కార్పొరేషన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ చిలుకూరి రామ్ కుమార్ కు బీ.జే.పీ. పార్టీ మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రమణ్యం చిన్నారుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పౌష్టికాహారం అందించడం ద్వారా చిన్నారులను ఆరోగ్యవంతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నాయన్నారు.
ఐ.సి.డి.ఎస్ కు 80 లక్షలు సహాయం…
![WhatsApp Image 2023-12-02 at 4.52.31 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-02-at-4.52.31-PM.jpeg?resize=1280%2C700&ssl=1)