దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలొ నేడు 4వ దశలో అన్ని స్థానాలకు పోలింగ్ జరుగింది. 17 స్థానాల్లో హైదరాబాద్ ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎం.పీ. అసదుద్దీన్ ఒవైసీతో బీ.జే.పీ.కి చెందిన మాధవి లత తీవ్ర పోటీలో ఉన్నారు. ఇప్పుడు, బీ.జే.పీ. అభ్యర్థి మాధవి లత బురఖా ధరించిన మస్లిన్ మహిళల ఓటర్ ఐడి కార్డులను తనిఖీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
బీ.జే.పీ. నాయకురాలు మాధవి లత కూడా తన చర్యను సమర్థిస్తూ… ఫేస్మాస్క్లు లేకుండా తమ ఐడి కార్డులను తనిఖీ చేసే హక్కు అభ్యర్థులకు ఉందని ఆమె అన్నారు. చట్టప్రకారం ముఖానికి మాస్క్లు లేకుండా ID కార్డులను తనిఖీ చేసే హక్కు అభ్యర్థిని కలిగి ఉందని అన్నారు. నేను పురుషుడిని కాదు, నేను స్త్రీని చాలా వినయంతో నేను వారిని అభ్యర్థించానన్నారు.
మహిళా కానిస్టేబుళ్లు తమ గుర్తింపు కార్డులతో ఓటర్ల ముఖాలను సరిపోల్చాలని సూచించడం లేదని ఆమె తెలిపారు. 90% బూత్లు రాజీ పడ్డాయి. ఓటర్ ఐడితో ముఖాన్ని తనిఖీ చేయమని పోలీసులు మహిళా కానిస్టేబుళ్లను ఆదేశించాలనుకోవడం లేదన్నారు.