ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు ఉద్యోగుల మరణానికి దారితీసిన పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదంపై ప్రతిపక్షాల ఇండియా బ్లాక్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై దాడి చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ… బీ.జే.పీ. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికుల సౌకర్యాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్నికలను మాత్రమే పట్టించుకుంటున్నదని ఆమె అన్నారు. రైల్వే అధికారులు, రైల్వే ఇంజనీర్లు, రైల్వే టెక్నికల్ సిబ్బంది, కార్మికులను సైతం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వారు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని అది గమనించాలన్నారు.
బీ.జే.పీ. ఎన్నికల గురించి మాత్రమే ఆలోచిస్తుంది… -మమతా బెనర్జీ-
![mamata](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/04/mamata.jpg?resize=1200%2C700&ssl=1)