బొందిలి కులాన్ని ఓ.బీ.సీ. లో చేర్చేదెందుకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరుని బొందిలి కులస్తులు రాష్ట్ర నాయకులు కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సుజన్ సింగ్, శంకర్ సింగ్ మాట్లాడుతూ… బొందిలి కులాన్ని ఓ.బీ.సీ. లో చేర్చేందుకు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి తో బొందిలి కులస్తులు రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో కేంద్ర పరిధిలో ఉన్న బీ.జే.పీ. కేటగిరీలో చేర్చడానికి ఎన్సీబీసీ చైర్మన్ గారికి సిఫార్సు చేయుటకు పురందేశ్వరి గారిని కలవడం జరిగింది.
పురందేశ్వరి గారు సానుకూలంగా స్పందించి ఎన్సీబీసీ చైర్మన్ గారితో ఫోన్లో సంప్రదించి బొంధిలో కులాన్ని బీ.జే.పీ. లిస్టులో కలుపుటకు రికమండేషన్ చేశారు. ఈ విషయమై తగు సహకారం ఏ.పీ. స్టేట్ బీ.జే.పీ. తరపున తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొందిలిసంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్. సుజన్ సింగ్, యూత్ ప్రెసిడెంట్ బి. శంకర్ సింగ్, జనరల్ సెక్రెటరీ టీ. సాయి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు