జనాభా దామాషా ప్రకారం తమకు తగ్గ సీట్లు కేటాయించని రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని బీ.సీ. కులాల ఐక్య పోరాట వేదిక నాయకులు హెచ్చరించారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట శ్రీ కన్వెన్షన్ హాల్ నందు బీ.సీ. కులాల ఐక్యవేదిక, పోరాట వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ అధ్యక్షతన శెట్టిబలిజ కన్వీనర్ పంపన బుజ్జి ఆధ్వర్యంలో బీ.సీ కులాల ఐక్య పోరాట వేదిక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చొల్లంగి వేణుగోపాల్ మాట్లాడుతూ… అన్ని రాజకీయా పార్టీలు బీ.సీ. కులాలను చిన్న చూపు చూస్తున్నాయన్నారు. ఒక్క కాకినాడ పార్లమెంట్ పరిధిలో పదిలక్షల ఓట్లు కలిగిన తమకు తగినంత ప్రాధాన్యత కల్పించడం లేదని, బీ.సీ. కులాలకు ఉన్న సంఖ్య ప్రకారం సీట్లు కేటాయించని రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఈ సమావేశంలో సుందరపల్లి గోపాలకృష్ణ , పెద్దింశెట్టి వెంకటేశ్వర రావు, ఆవుపాటి ఉమా శంకర్, మల్లాడి రాజు, కోలా ప్రసాద్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.