Viral

బీ.సీ. డిక్లరేషన్లు పట్ల నేతల హర్షం…

WhatsApp Image 2024-03-08 at 9.23.59 PM

ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన పార్టీలు ప్రకటించిన బీ.సీ. డీక్లరేషన్ ఎంతో ఉపయోగంగా ఉందని బీ.సీ. సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీ.సీ. డిక్లరేషన్ పై కాకినాడలో పలువురు బీ.సీ. సంఘాల నాయకులు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీ.డీ.పీ. నాయకుడు వాసoశెట్టి సుభాష్ మాట్లాడుతూ… వైయస్సార్సీపి ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఇచ్చి ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు.

కానీ బీ.సీ. డిక్లరేషన్ లో తెలుగుదేశం-జనసేన పార్టీలు జైహో బీ.సీ. సమావేశంలో ఈ నెల 5వ ప్రకటించిన డిక్లరేషన్ వారి స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి వారికి ఐదు సంవత్సరాలకు 1,50,000 కోట్ల బడ్జెట్లు ప్రకటించడo జరిగిందన్నారు. 50 ఏళ్లు దాటిన బీ.సీ. లకు 4వేల ఫించన్ ప్రకటించడం, వారికి రక్షణ చట్టం చేయడం, స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కోల్పోయిన రిజర్వేషన్లను తిరిగి 34 శాతానికి పునరుద్ధరిస్తామని ప్రకటించడం హర్షనియమన్నారు.

చట్టసభల్లో అడుగుపెట్టని కులాలకు నామినేటెడ్ పదవులు ఇస్తామని అలాగే నామినేటెడ్ పదవుల్లో కూడా 34% రిజర్వేషన్ పాటిస్తామని చెప్పడం బీ.సీ. లకు ఎంతో ఉపయోగపడుతుందని సుభాష్ తెలియజేశారు. ఈ సమావేశంలో పప్పు దుర్గారమేష్, సుందరపల్లి వి.వి.ఎస్. గోపాలకృష్ణ, ఎం.ఎ. తాజుద్దీన్, కొక్కిలగడ్డ గంగరాజు, వమ్మి బాలాజీ, తదితరులు పాల్గొన్నారు

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.