దొమ్మేరు గ్రామంలో ఎస్.సి. యువకుడు బొంతు మహేoద్ర (21) ఆయన కుటుంబం వై.ఎస్. ఆర్ పార్టీ కి చెందిన వారు. ఆ పార్టీకి చెందిన ఫ్లక్సీ చింపాడనే అనుమానంతో ఆ పార్టీ నేతలు ఇచ్చిన పిర్యాదు తో కొవ్వూరు సబ్ ఇన్స్పెక్టర్ దొమ్మేరు వచ్చి మహేంద్రను స్టేషన్ కు తీసుకొని వెళ్లి పోలీసుల స్టైల్ లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తీవ్ర మనస్థాపం చెందిన మహేoద్ర గడ్డి మందు తాగి మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న పిట్టా వరప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరు గ్రామం వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, బంధువులు, గ్రామస్తులు నుండి విషయాలు సేకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… పార్టీనేతలు, పోలీసుల దుర్మార్గపు చర్య వల్లే మహేంద్ర ప్రాణాలు పోయాయన్నారు. ఇంటర్, ఐ.టి.ఐ. చదివి ఉజ్జల భవిష్యత్తు ఉన్న మహేంద్ర మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, మహేంద్ర మరణానికి కారణమైన అందరిని కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితుల ప్రాణాలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
దళితులను చంపిన వారికి పార్టీలో ఉన్నత పదవులు ఇవ్వడం, హంతకులతో కలసి ముఖ్యమంత్రి సభలు సమావేశాల్లో పాల్గొనడం దుర్మార్గం అన్నారు.